Yediyurappa: ఈ మూడు రాష్ట్రాల ప్రజలు మా రాష్ట్రంలో అడుగుపెట్టొద్దు: యడియూరప్ప

Yediyurappa requests 3 states people not to come to Karnataka
  • మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో అధిక  కరోనా కేసులు
  • జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ రాష్ట్రాల వారిని రావద్దన్న సర్కారు
  • కర్ణాటకలో తెరుచుకుంటున్న దుకాణాలు
మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడుతున్నప్పటికీ... ఈ మూడు  రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి ఎవరూ రావద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

 ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్లే తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పక్క రాష్ట్రాలతో అవగాహనతో ప్రజలను, వాహనాలను అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, రాష్ట్రం లోపల తిరిగే రైళ్లకు అనుమతినిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
Yediyurappa
Karnataka
Corona Virus

More Telugu News