న్యూయార్క్ లో కరోనా మరోరూపం... ఎర్రగామారి, ఉబ్బిపోతున్న చిన్నారుల రక్తనాళాలు!
- కరోనా హాట్ స్పాట్ గా న్యూయార్క్
- 100 మంది పిల్లల్లో లక్షణాలు, ముగ్గురి మృతి
- ఆందోళన కలిగిస్తున్న కొత్త మహమ్మారి
కాగా, వైద్య పరిభాషలో కవాసకీ డిసీజ్ లక్షణాలను పరిశీలిస్తే, ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తనాళాలు ఎర్రగా మారి ఉబ్బిపోతాయి. జ్వరం వస్తుంది. ఈ లక్షణాలు మూడు దశల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఇది ఐదేళ్లలోపున్న పిల్లలకు సోకుతుంది. కానీ న్యూయార్క్ లో 18 ఏళ్ల అమ్మాయి కూడా ఇవే లక్షణాలతో మరణించడం ఇప్పుడు అక్కడి వారిలో ఆందోళన కలిగిస్తోంది.
దీనిపై మరింత వివరణ ఇచ్చిన ఆండ్రూ కూమో, "ఇది ఏదో ఇప్పుడే మొదలైంది. పైకి కనిపిస్తున్న లక్షణాలన్నీ కవాసకీ డిసీజ్ లేదా టాక్సిస్ షాక్ సిండ్రోమ్ లా కనిపిస్తున్నాయి. కొవిడ్ వైరస్ నుంచే ఇది సంభవించిందని భావిస్తున్నాము" అని అన్నారు. రక్త నాళాలపై తొలుత ప్రభావం చూపే ఈ వైరస్, ఆపై గుండెపైనా ప్రభావం చూపుతోందని, న్యూయార్క్ లో కనిపిస్తున్న ఈ మరో మహమ్మారి ఇతర రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశాలున్నాయని, ఈ వ్యాధి కనిపిస్తున్న చిన్నారుల్లో కరోనా లక్షణాలు మాత్రం కనిపించడం లేదని తెలిపారు.
వాస్తవానికి కవాసకీ డిసీజ్ చాలా అరుదుగా వస్తుంటుంది. యూఎస్ లో ఏడాదికి దాదాపు 20 వేల కేసుల వరకూ నమోదవుతుంటాయి. సాధారణంగా లభించే యాస్ప్రిన్ మందుతోనే నయమవుతూ ఉంటుంది. న్యూయార్క్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్న వారిలో 29 శాతం మంది ఐదేళ్ల నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు కాగా, 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 28 శాతం ఉన్నారని తెలుస్తోంది.