అవగాహన లేకుండా మీడియా ముందుకు రావడం ఆయన నైజం: రాహుల్ పై బీజేపీ ఫైర్
- లాక్ డౌన్ కొనసాగింపుపై రాహుల్ విమర్శలు
- కేంద్రం పారదర్శకతతో వ్యవహరిస్తోందన్న బీజేపీ నేత సుధాంషు
- వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారని విమర్శ
కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని త్రివేది అన్నారు. అన్ని రాష్ట్రాలను, జిల్లాల మేజిస్ట్రేట్ (కలెక్టర్) లను కూడా ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రుల మీద, జిల్లా మేజిస్ట్రేట్ ల మీద ప్రధాని విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్ నైజమని ధ్వజమెత్తారు.