కరోనా కేసుల్లో లక్షణాలు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర బృందానికి తెలిపిన ఏపీ ప్రభుత్వం
- రాష్ట్రంలో కరోనా పరిస్థితి పరిశీలనకు కేంద్ర బృందం రాక
- ఉన్నతాధికారులతో సమావేశం
- కరోనా వివరాలు కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ సందర్భంగా, కరోనా బారినపడిన వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది వివరాలను కేంద్ర బృందానికి సమర్పించింది. వైద్య సిబ్బందిలో 67 మందికి కరోనా సోకిందని, 89 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వీరిలో పోలీస్, రెవెన్యూ, శానిటరీ, వలంటీర్, ఆశా ఉద్యోగులు ఉన్నారని నివేదించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలో 37 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించామని, వీరిలో ఒకరి వల్ల అత్యధికంగా 34 మందికి సోకినట్టు గుర్తించామని తెలిపింది.