వలస కూలీల దుర్మరణం బాధాకరం: పవన్ కల్యాణ్
- ఈ ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
- మృతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. శ్రామిక్ రైళ్లకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను చేపట్టడంలో, సంబంధిత సమాచారాన్ని కూలీలకు అందించడంలో రాష్ట్రాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ దుర్ఘటన తెలియజేస్తోందని అన్నారు.