క్వారంటైన్ గడువు పూర్తయిన తబ్లిగీ జమాత్ సభ్యుల విడుదలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు!
- 4 వేల మందిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు
- మిగిలినవారిలో అత్యధికులు తెలంగాణ, తమిళనాడుకు చెందినవారు
- మర్కజ్ ఘటనతో సంబంధం ఉన్నవారిని పోలీసులకు అప్పగించాలని ఆదేశం
ఢిల్లీ క్వారంటైన్లలో అధికారిక లెక్కల ప్రకారం 4 వేల మంది తబ్లిగీ సభ్యులు ఉన్నారు. వీరిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు కాగా... మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు తెలంగాణ, తమిళనాడుకు చెందినవారని చెప్పారు. ఢిల్లీ క్వారంటైన్లలో కొందరు తబ్లిగీ సభ్యులు ఆరోగ్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.