నీటి సమస్యపై.. మంత్రి కేటీఆర్ కి అసదుద్దీన్ విజ్ఞప్తి
- నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది
- తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి
- కృష్ణా ఫేజ్2, ఫేజ్3 నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలి
లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, ఇతర కమర్షియల్ కార్యకలాపాలు మూతపడిన తరుణంలో కూడా నీటి కొరత ఉండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ప్రజలంతా ఇంటి వద్దే ఉండటంతో నీటి వినియోగం పెరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేయకుండా... వాటర్ ట్యాంకర్లను పంపడం వల్ల సామాజిక దూరం అనే దానికి అర్థం ఉండదని ఒవైసీ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. కృష్ణా ఫేజ్2, ఫేజ్3 నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని విన్నవించారు.