లాక్ డౌన్ ఎఫెక్ట్.. సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా!
- ఈ నెల 31న నిర్వహించాల్సి ఉన్న ప్రిలిమినరీ పరీక్షలు
- ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన
- తిరిగి ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్న అధికారులు
కాగా, యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా నేతృత్వంలో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.