సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీం నిరాకరణ

Supreme Court refuses to put a hold on Delhi Central Vista project
  • కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక  ప్రాజెక్టుకు మార్గం సుగమం
  • భూ వినియోగంలో మార్పులను సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్లపై విచారణ
  • 20 వేల కోట్ల వ్యయంతో నూతన పార్లమెంట్‌, ఇతర భవనాల నిర్మాణం
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 20 వేల కోట్లతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్’ ను నిలిపివేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ ప్రాజెక్ట్ కోసం భూ వినియోగ చట్టంలో మార్పు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ దాఖలైన  పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ  ప్రాజెక్ట్ పై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని గురువారం తేల్చి చెప్పింది.  దీంతో ఈ  భారీ ప్రాజెక్ట్ కు మార్గం సుగమమైంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కొత్త పార్లమెంట్ సహా పలు భవనాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ అభివృద్ధి మండలి (డీడీఏ) సిఫారసుల మేరకు ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే భూ వినియోగంలో మార్పులు చేసింది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో హరిత ప్రదేశాలు, పబ్లిక్‌-సెమీ-పబ్లిక్‌ ప్రదేశాలు మరింత మెరుగుపడతాయి.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్‌ సముదాయం, నార్త్- సౌత్‌ బ్లాక్‌, ఇండియా గేట్‌, నేషనల్‌ ఆర్కైవ్స్‌ భవనాలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త రాజధానిలో భాగంగా 1931కి ముందు నిర్మించినవే. కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు కూడా నిర్మించనున్నారు. కాగా,  ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గటంతో ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలని ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో సోనియా కోరారు. ప్రాజెక్ట్ కు చేసే ఖర్చును ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించాలని సూచించారు.
Go Back to Shorts
Supreme Court
refuses
central vista
project
put on hold

More Telugu News