బ్రెజిల్ లో దయనీయం... కొత్త కేసులకు ఖాళీ లేదంటున్న ఆసుపత్రులు!
- బ్రెజిల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,995
- ఇప్పటివరకు 3600 మంది మృతి
- కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
- భౌతికదూరం అక్కర్లేదంటున్న దేశాధ్యక్షుడు
ఆసుపత్రుల సంగతి అటుంచితే, మార్చురీల్లో సైతం ఖాళీ ఉండడంలేదు. అటు శ్మశాన వాటికలు సైతం కరోనా మృతుల తాకిడి ఎదుర్కొంటున్నాయి. మానాస్ సిటీలో భారీ గోతులు తీసి వాటిలో సామూహిక ఖననం చేస్తున్నారు. బ్రెజిల్ వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తీరు విచిత్రంగా ఉంది. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, ముప్పు ఉన్నవారిని ఐసోలేషన్ చేస్తే సరిపోతుందని సెలవిస్తున్నారు.