పంట పొలాల్లో పులి సంచారం...ఆందోళన చెందుతున్న గ్రామస్థులు
- మంచిర్యాల జిల్లా గోపాలరావుపేట గ్రామ శివారులో పరిస్థితి
- వ్యవసాయ పనుల సీజన్ కావడంతో ఇబ్బంది
- అటవీ శాఖకు సమాచారం
నిన్నటి నుంచి పొలాల్లోనే పులి తిరుగుతుండడంతో పొలాల వైపు వెళ్లడానికే వారు భయపడుతున్నారు. అటవీ శాఖ సిబ్బందికి గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులిని బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో గ్రామస్థులు, చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.