Vamshi Paidipalli: చరణ్ పై దృష్టి పెట్టిన వంశీ పైడిపల్లి

Vamshi Paidipalli Movie
  • 'మహర్షి'తో దక్కిన సూపర్ హిట్ 
  • మహేశ్ తో మళ్లీ దక్కని అదృష్టం 
  •  కొత్త కథపై వంశీ పైడిపల్లి కసరత్తు

'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ మహేశ్ బాబుతోనే సినిమా చేయాలని వంశీ పైడిపల్లి భావించాడు. అందుకు తగిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో చరణ్ మీద వంశీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' చేస్తున్న చరణ్, ఆ తరువాత సినిమాను ఏ దర్శకుడితో చేయాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అందువలన తన తదుపరి సినిమాను ఆయనతో సెట్ చేయాలని వంశీ పైడిపల్లి ప్రయత్నాలు చేస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఎవడు' వంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News