Andhra Pradesh: సైకిల్‌ కోసం జమ చేసుకున్న రూ.971ను ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చిన నాలుగేళ్ల చిన్నారి

Andhra Pradesh A 4 year old boy Hemanth has donated his savings of Rs 971
  • పేర్ని నానిని కలిసిన బాలుడు
  • అభినందించిన మంత్రి
  • చిన్నారితో కాసేపు మాట్లాడిన మంత్రి 
కరోనా విజృంభణ నేపథ్యంలో పిల్లలు కూడా ప్రభుత్వాలకు సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి ఓ చిన్నారి (4) ఈ రోజు విరాళం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు ఇచ్చిన చిల్లర డబ్బులను సైకిల్‌ కొనుక్కోవడానికి దాచిపెట్టుకుంటున్న హేమంత్‌ అనే చిన్నారి.. కరోనాతో ఆకలితో అలమటిస్తోన్న వారికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆలోచించాడు.

దీంతో తాను ఇన్నాళ్లు జమ చేసుకున్న రూ. 971లను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చాడు. ఈ రోజు ఉదయం తన తల్లిదండ్రులతో కలిసి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వచ్చిన హేమంత్‌ ఈ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నానికి అందజేశారు. ఆ చిన్నారిని మంత్రి అభినందించారు. తన టేబుల్‌పై ఆ బాలుడిని కూర్చోబెట్టి కాసేపు మాట్లాడారు.

కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రజలు కూడా విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 304కు చేరింది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Andhra Pradesh
Corona Virus
Perni Nani

More Telugu News