Corona Virus: ఏపీలో 15 గంటల వ్యవధిలో ఒకేఒక కరోనా పాజిటివ్!

Only One Positive Corona in Last 15 Hours in AP
  • మొత్తం కేసుల సంఖ్య 304
  • కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి మరణం
  • గుంటూరు జిల్లాలో ఓ పాజిటివ్ కేసు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన ఆరోగ్య శాఖ, కొత్తగా ఒక కేసు మాత్రమే నమోదైందని తెలిపింది. "రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్తగా గుంటూరులో ఒక కేసు నమోదయింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కారణంగా ఒక మరణం నిర్ధారించబడింది" అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఏపీలో మర్కజ్ కాంటాక్టులను నియంత్రించడంలో విజయం సాధిస్తే, క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive

More Telugu News