అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్!
- దీపాలు వెలిగించాలన్న మోదీ పిలుపును అవహేళన చేస్తారా?
- ‘నీకు సిగ్గుందా? జ్ఞానం ఉందా?’
- తొమ్మిది గంటలకు చార్మినార్ ఎక్కి చూడు, భారతీయుల దీపాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది
మోదీ పిలుపును అవహేళన చేసే విధంగా అసదుద్దీన్ మాట్లాడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపం పెట్టమంటే హేళన చేస్తావా? ‘నీకు సిగ్గుందా? జ్ఞానం ఉందా?’ అంటూ అసదుద్దీన్ పై విరుచుకుపడ్డారు. రాత్రి తొమ్మిది గంటలకు చార్మినార్ ఎక్కి చూడు, భారతీయుల దీపాలు ఎలా ఉన్నాయో తెలుస్తుందంటూ అసదుద్దీన్ కు సూచించారు.