కొన్ని గంటల వ్యవధిలోనే పెరిగిన మరణాలు... భారత్ లో 3 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారి
- దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,188
- 94కి చేరిన మృతుల సంఖ్య
దీన్నిబట్టే భారత్ లో ఇప్పుడు కీలకదశ నెలకొందని అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ పేరిట ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. అప్పటినుంచి కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో జమాత్ కు హాజరైన వారికోసం అధికారవర్గాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఓ వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జమాత్ కు హాజరైన వారే కావడం గమనార్హం.