చిల్లర దొంగల చేతివాటం...ఆలయాల హుండీలపై కన్ను
- ఆలయాల మూసివేతతో నగదు అపహరణ
- గుంటూరు జిల్లాలో రెండు సంఘటనలు
- మూడు రోజుల వ్యవధిలో రెండు చోట్ల దొంగతనం
ఇదే అదనుగా చిల్లర దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గుడుల్లో హుండీల చోరీకి పాల్పడుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో గుంటూరు జిల్లాలో ఇటువంటివి రెండు చోరీలు వెలుగు చూడడంతో పోలీసులు అలర్టయ్యారు. గుంటూరు నగరం ఏటీ అగ్రహారం రెండవ లైన్లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నిన్నరాత్రి చోరీ జరిగింది.
దుండగులు గడ్డపలుగుతో దేవాలయం హుండీ పగులగొట్టి అందులో ఉన్న నగదు అపహరించారు. మూడు రోజుల క్రితం తెనాలి మండలం బుర్రిపాలెంలో ఇద్దరు యువకులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆలయాల హుండీలపై నిర్వాహకులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.