కరోనా నేపథ్యంలో విమర్శల పాలవుతున్న పాకిస్థాన్ చర్య
- పంజాబ్ ప్రావిన్స్ లో 300 కరోనా కేసులు
- అందరినీ ఆక్రమిత కశ్మీర్ కు తరలిస్తున్న పాక్
- స్థానికుల్లో అసంతృప్తి
పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కరోనా బాధితుల కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల స్థానిక సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున కరోనా బాధితులను ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తున్నారని, ఇది తమకు ముప్పుగా పరిణమిస్తుందని పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలు వాపోతున్నారు. పంజాబ్ ను కరోనా రహితంగా మార్చేందుకు ఆజాద్ కశ్మీర్ ను డంపింగ్ యార్డుగా వాడుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.