21 రోజులు...రూ.9 లక్షల కోట్లు: లాక్డౌన్తో ఆర్థిక రంగానికి నష్టంపై లెక్క ఇది!
- జీడీపీలో నాలుగు శాతం ఆవిరి
- ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై ప్రభావం
- సమయం పెరిగితే మరింత పెరిగే అవకాశం
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధిరేటు కూడా 3.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోనుందని భావిస్తున్నారు. అదికూడా లాక్డౌన్ ఈ 21 రోజులతో ముగిస్తే పర్వాలేదు, లేదంటే మరింత ప్రభావం ఉంటుందని అంచనా.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టపోయిన రంగాలకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన సమీక్ష నివేదికను వెల్లడించనుంది. ఈ సందర్భంగా ప్యాకేజీ అంశం ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.