'జనతా కర్ఫ్యూ'పై కౌన్సిలర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు
- సీఏఏ చట్టాన్ని తొలగించేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దు
- జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని వీడియో
- కేసు నమోదు చేసి గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకునేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దని, జనతా కర్ప్యూను పట్టించుకోకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన షమీపై కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచినట్టు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.