తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు.. 16కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
- దుబాయ్ నుంచి వచ్చిన వ్యాపారికి కరోనా పాజిటివ్
- లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు
- వ్యాపారి కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్
లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులకు వైరస్ సోకింది. వీరిద్దరినీ నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయి. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.