అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తాం: నారా లోకేశ్
- ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం
- పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారని విమర్శలు
- సిగ్గుగా లేదా జగన్ గారూ అంటూ ట్వీట్
"టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారు, టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకర పోస్టులు చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు ఉండవు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసూల్ అనే కార్యకర్త అరెస్ట్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లోకేశ్ అక్కడి పోలీసులను ప్రశ్నించారు. రసూల్ కు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.