పుట్టపర్తిలో కరోనా కల్లోలం.. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు
- పుట్టపర్తికి వచ్చిన రష్యన్ వ్యక్తికి కరోనా లక్షణాలు
- ఐసొలేషన్ వార్డుకు తరలింపు
- సత్యసాయి సమాధిని తాకొద్దని భక్తులపై ఆంక్షలు
ఈ క్రమంలో సత్యసాయి ట్రస్ట్ అప్రమత్తమైంది. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు విధించారు. సత్యసాయి సమాధిని భక్తులెవరూ తాకవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పుట్టపర్తిని సందర్శిస్తున్న విదేశీ భక్తులు, పర్యాటకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.