పుట్టపర్తిలో కరోనా కల్లోలం.. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు

Restrictions in Puttaparthi due to corona virus
  • పుట్టపర్తికి వచ్చిన రష్యన్ వ్యక్తికి కరోనా లక్షణాలు
  • ఐసొలేషన్ వార్డుకు తరలింపు
  • సత్యసాయి సమాధిని తాకొద్దని భక్తులపై ఆంక్షలు
ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో కరోనా భయాందోళనలు పెరుగుతున్నాయి. అనునిత్యం ఎక్కడెక్కడి నుంచో సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యక్తి పుట్టపర్తికి వచ్చాడు. అతను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో స్థానిక ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో సత్యసాయి ట్రస్ట్ అప్రమత్తమైంది. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు విధించారు. సత్యసాయి సమాధిని భక్తులెవరూ తాకవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పుట్టపర్తిని సందర్శిస్తున్న విదేశీ భక్తులు, పర్యాటకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
Go Back to Shorts
Puttaparthi
Prashanthi Nilayam
Corona Virus

More Telugu News