భక్తులను కంపార్ట్ మెంట్లలో కూర్చోనివ్వరాదని టీటీడీ నిర్ణయం
- కరోనా ప్రభావం నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు
- భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల ద్వారా దర్శనం
- భక్తులు నిర్ణీత సమయానికి దర్శనం చేసుకోవాలన్న ఈవో
మంగళవారం నుంచి భక్తులను కంపార్ట్ మెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై టీటీడీ ఈవో మాట్లాడుతూ, గంటకు 4,500 మంది భక్తులు దర్శించుకునేలా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. భక్తులు నిర్ణీత సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా గుర్తింపు కార్డులు తీసుకురావాలని స్పష్టం చేశారు.