2,000 మంది అడ్డగించినా మన వాళ్లు నామినేషన్లు వేశారు: నాదెండ్ల మనోహర్
- 'శ్రీకాళహస్తిలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూశాం
- అయినప్పటికీ అర్ధరాత్రి వరకు జనసేన నేతలు పోరాడి నిలబడ్డారు
- అనంతపురంలో 100 మంది నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే దాడి
- జనసేనకు, ఇతర పార్టీలకు ఉన్న తేడాలను మనం తెలపాలి
'శ్రీకాళహస్తిలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూశాం. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు జనసేన నేతలు పోరాడి నిలబడ్డారు. అనంతపురంలో 100 మంది నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే 2000 మంది రోడ్డుకి అడ్డంగా నిలబడి రాళ్లు వేశారు. అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని నామినేషన్ వేశారు. అటువంటి నేతలు, కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు' అని తెలిపారు.
'జనసేనకు, ఇతర పార్టీలకు ఉన్న తేడాలను మనం తెలపాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా పండుగ వాతావరణంలో జరగాలి. మంచి నేతలను గుర్తించడం కోసం యువతకు ఇందులో పవన్ కల్యాణ్ అవకాశం కల్పించారు' అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.