bojjala sudheer reddy: శ్రీకాళహస్తిలో ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రకటన

ap local body elections
  • టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు
  • మా నామినేషన్‌ పత్రాలను చింపేశారు
  • కష్టపడి నామినేషన్‌ వేస్తే తిరస్కరిస్తున్నారు
  • ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
శ్రీకాళహస్తిలో ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ఈ రోజు శ్రీకాళహస్తిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలు నామినేషన్‌ వేయడానికి వస్తే వారి పత్రాలను చింపేశారని తెలిపారు.

ఒకవేళ అన్నిటినీ ఎదుర్కొని కష్టపడి నామినేషన్‌ వేస్తే దాన్ని తిరస్కరిస్తున్నారని బొజ్జల సుధీర్‌ రెడ్డి చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల్లో ఏంటన్న భయం నెలకొందని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆగడాలు అధికమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
bojjala sudheer reddy

More Telugu News