Biswabhusan Harichandan: ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు

Governor and his wife names have registered as voters in AP
  • ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా గవర్నర్ దంపతుల పేర్లు నమోదు
  • విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలోకి ఏపీ రాజ్ భవన్
  • పేర్లను నమోదు చేసుకున్న ఉప తహసీల్దార్ నాగమణి 
విజయావాడలో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ లు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు పొందారు. గవర్నర్ దంపతులు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.

గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహసీల్దార్ నాగమణి ఓటర్లుగా వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అప్పటి కప్పుడే వివరాలను సరిచూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రథమ పౌరుడు అయిన హరిచందన్ కు అతి త్వరలోనే ఓటరు కార్డును అందజేస్తామని తెలిపారు . కాగా, విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలో ఏపీ రాజ్ భవన్ ఉంది. 
Biswabhusan Harichandan
Governor
Andhra Pradesh
wife
suprava

More Telugu News