Visakhapatnam: మృతి చెందిన జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల మనోహర్‌

  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన
  • విశాఖకు చెందిన దువ్వి వెంకటరమణ ఇటీవల మృతి
  • పార్టీలో తొలి నుంచి చురుకైన కార్యకర్తగా గుర్తింపు
nadendla manohar  meets expaired janasena activist family

విశాఖ నగరంలో చురుకైన పార్టీ కార్యకర్తగా గుర్తింపు సొంతం చేసుకుని, ఇటీవల హఠాన్మరణానికి గురైన జన సైనికుడు దువ్వి వెంకటరమణ కుటుంబాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఈరోజు పరామర్శించారు. నగరంలోని వెంకటరమణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తొలి నుంచి పార్టీ సైనికునిగా వెంకటరమణ అందించిన సేవలను మననం చేసుకున్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వెంకటరమణ చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారని, ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

More Telugu News