ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం వద్ద ఫొటో దిగిన ఆనంద్‌ మహీంద్ర

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫొటో దిగారు. ఈ ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. విలువైన జ్ఞాపకాలతో ఉండే తన ఆల్బమ్ కోసం ఈ ఫొటో దిగానని, ఇది మార్వెల్ పాత్ర దగ్గర కాదని, నిజమైన ఐరన్ మ్యాన్ పాదాల వద్ద అని ఆయన పేర్కొన్నారు.

వల్లభాయ్ పటేల్‌తో పాటు ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. పిక్‌ ఆఫ్‌ ది డే అంటూ రిప్లై ఇస్తున్నారు. నిజమైన హీరో ఆనంద్‌ మహీంద్ర అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 


More Telugu News