చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారు: విజయసాయిరెడ్డి

Ysrcp mp vijayasai reddy comments on chandrababu
  • రాజధాని తరలించొద్దన్న పిలుపుతో ఏదో అయిపోతుందనుకున్నారు
  • దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు
  • దీంతో ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు.


Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
mp
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News