మన రెండు రాజ్యాంగాలు మూడు అందమైన పదాలతో ప్రారంభం అవుతాయి: ట్రంప్
- ఘనమైన రీతిలో స్వాగత సత్కారాలు
- భారత్ పర్యటనను ఆస్వాదిస్తున్న ట్రంప్
- రాజ్యాంగాలే కాదు విధానాలు కూడా ఒక్కటేనని ట్వీట్
"మన రెండు రాజ్యాంగాలు 'వియ్ ద పీపుల్' అనే మూడు అందమైన పదాలతో ప్రారంభమవుతాయి. దానర్థం, అమెరికాలో కానీ, భారత్ లో కానీ గౌరవం, మర్యాద, విశ్వాసం, సాధికారత, ప్రజల కోసం పోరాడే విధానం ఒకే విధంగా ఉంటాయి" అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో ట్వీట్ ను హిందీలో చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, అమెరికా, భారత్ తమ అనుబంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాయని, ప్రజల ఆకాంక్షలను మరింత ఉజ్వలంగా నెరవేర్చుతాయని పేర్కొన్నారు.