నేషనలిజం పదం వాడొద్దు.. అది నాజీయిజంలా అనిపిస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- ఛాందసవాదం కారణంగా దేశంలో కొంత అశాంతి ఉంది
- ఎవరికీ బానిసలం కాదు.. ఎవరినీ బానిసలను చేసుకోబోం
- భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతేనని వ్యాఖ్య
ఫండమెంటలిజం (ఛాందస వాదం)తో అశాంతి
ఛాందసవాదం కారణంగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత భిన్నత్వం ఉన్నా కూడా పౌరులంతా ఒకరితో ఒకరు కలిసి ఉంటున్నారని, ఇది దేశం గొప్పతనమని పేర్కొన్నారు.‘‘దేశంలో ఛాందస వాదం కారణంగా కొంత అశాంతి ఉంది. అయితే ఎవరికీ బానిసలుగా ఉండకపోవడం, ఎవరినీ బానిసలుగా చేసుకోకపోవడమే మన దేశ విధానం. అందరినీ కలిపేలా, అందరూ కలిసుండేలా చేసే ప్రత్యేకత మన దేశానిది. భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతే..” అని మోహన్ భగవత్ చెప్పారు.