రాజశేఖర్ రెడ్డి ఇలా ఎప్పుడూ చేయలేదు కానీ, చంద్రబాబు, కేసీఆర్ చేశారు: ఉండవల్లి
- ఏపీలో కొన్ని మీడియా చానళ్ల నిలిపివేత
- వైఎస్ ఎప్పుడూ మీడియా మీదకు వెళ్లలేదని వెల్లడి
- వ్యతిరేక వార్తలకు భయపడితే పతనం ప్రారంభమైనట్టేనని వ్యాఖ్యలు
"రాజశేఖర్ రెడ్డి ఏనాడూ మీడియా మీదికి వెళ్లలేదు. ఏ మీడియాను ఆపుచేయాలని ప్రయత్నించలేదు. ఈనాడులో ఇలా రాస్తారయా, ఆ రెండు పేపర్లు ఇంతేనని డైరెక్ట్ గా చెప్పేవాడు తప్ప, ఎవరిపైనా చర్యలకు దిగలేదు. ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానళ్లు రావడంలేదు. నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వమే రాష్ట్రం మొత్తం ఆపేయమందట. ఇంతకుముందు కేసీఆర్ ఇలాగే చేశాడు, చంద్రబాబు ఇలాగే చేశాడు. ఆ పని జగన్ మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ, ఇది చాలా తప్పు. మీకు వ్యతిరేకంగా వచ్చే వార్తలకు మీరు భయపడిన మరుక్షణం మీ పతనం ప్రారంభమైనట్టే" అంటూ ఘాటుగా స్పందించారు.