Chandrababu: ఏ చట్టం ప్రకారం రాజధానిని తరలించాలని చూస్తున్నారు?: చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, 23-04-2015 లో అమరావతి ఏపీ రాజధానిగా జీవో విడుదల చేశామని గుర్తుచేశారు. ఏ చట్టం ప్రకారం రాజధానిని తరలించాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి పరిపాలించడం తెలియదు అని, కక్షలు, కార్పణ్యాలతో రైతుల పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారని నిప్పులు చెరిగారు. ‘ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు, నీ తిక్క కుదిరే వరకూ వదిలిపెట్టం’ అని జగన్ ని హెచ్చరించారు.

ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయని, ఒకే ఒక్క చెత్త పార్టీ వైసీపీకి ఆశయాలు, ఆలోచనలు లేవని, ఈ పార్టీ గాలి కొచ్చిందని, గాలికే పోతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ పార్టీ ప్రజలకు నష్టం చేస్తోందని, అదే తన బాధ అని అన్నారు. రాజధాని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని, సమస్యకు పరిష్కారం కన్నీళ్లు కాదని, అధైర్యపడొద్దని వీరనారీమణులులా పోరాడాలని పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News