పాక్ లో ముస్లింల పరిస్థితి అంతే: అద్నాన్ సమీ
- కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుంచి భారతీయుల తరలింపు
- పాకిస్థాన్ సిగ్గుపడాలన్న సమీ
- ముస్లింలను ఓ పనికిరాని చెత్త కింద విసిరేశారని ఆగ్రహం
దీనిపై ఓ పాక్ విద్యార్థి ట్విట్టర్ లో స్పందిస్తూ, చైనాలో చిక్కుకున్న తన పౌరులను భారత్ ఎలా కాపాడుకుంటోందో చూడండి అంటూ ఓ వీడియో పోస్టు చేశాడు. దీనిపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ స్పందించారు. తమ జీవితాంతం ముస్లింలు భారత్ కు విధేయులై ఉండాలని పేర్కొన్నారు. "ముస్లింలను పాకిస్థాన్ గవర్నమెంట్ ఓ పనికిరాని చెత్త కింద విసిరేసింది, అంతకంటే గొప్ప మర్యాద పాకిస్థానీ ముస్లింలకు ఎలా లభిస్తుంది?" అంటూ ట్వీట్ చేశారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం అని పేర్కొన్నారు.