Telugudesam: ’తుగ్లక్‘ అంటుంటే ఉక్రోషం పట్టలేకనే ఈ దాడులు: జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

  • జగన్ చేతకానితనం దేశానికి తెలిసిపోయింది
  • మా హయాంలో ‘సీమ’లో ఉపాధి అవకాశం కల్పించాం
  • అటువంటి మమ్మల్ని దేశద్రోహులని అంటారా?
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ని అడ్డుకోవడం, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టిన ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. బాలకృష్ణ కాన్వాయ్ పై దాడి, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కాగడాలతో చుట్టముట్టడం.. ఏమిటివన్నీ? వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

జగన్ అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయాయని, ఆయన్ని అందరూ ‘తుగ్లక్’ అంటుంటే ఉక్రోషం పట్టలేకనే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, అటువంటి తమను దేశద్రోహులు అంటారా? అని ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోందంటూ వైసీపీపై మండిపడ్డారు.
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
cm

More Telugu News