Telugudesam: మూర్ఖుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు!: జగన్ పై చంద్రబాబు విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
‘మూర్ఖుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్న చందంగా సీఎం జగన్ తీరు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. రాజధానిని తరలించ వద్దంటూ రాయలసీమ ప్రాంతం నుంచి అమరావతికి వచ్చిన మహిళలు తమ అభిప్రాయాలను ఆ వీడియోలో వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని భావిస్తున్నామని, అందుకే, ఇక్కడికి వచ్చి తమ మద్దతు తెలుపుతున్నామని అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి వచ్చిన మహిళ వరలక్ష్మి తెలిపారు. అధికారం చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కరెక్టు కాదని, అభివృద్ధి చేయాలనుకుంటే ఇన్ని రాజధానులు అవసరం లేదన్నది తన అభిప్రాయంగా చెప్పారు.

Go Back to Shorts
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
cm

More Telugu News