ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో సరికొత్త లోగో: సీఎం హేమంత్‌ సోరెన్‌

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త అడుగులు వేద్దామని, రాష్ట్ర అధికారిక లోగో మార్పు నుంచీ దీన్ని ప్రారంభిద్దామని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ పిలుపునిచ్చారు. రిపబ్లిక్‌డే ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించబోయే లోగోకు నిపుణులు, మేధావులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఝార్ఖండ్‌ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉంటుందని, ఇందుకు అన్నివర్గాలు తమవంతు చేయూత అందించాలని కోరారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా, కాంగ్రెస్‌, ఆర్జేడీ సంయుక్త కూటమి విజయదుందభి మోగించగా, హేమంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Jharkhnand
new logo
CM soren

More Telugu News