హింస ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతం బాగుపడలేదు: మోదీ

  • మన్ కీ బాత్ లో ప్రధాని వ్యాఖ్యలు
  • హింసతో సమస్య పరిష్కారం కాదని వెల్లడి
  • శాంతిబాట పట్టాలని పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ సమస్యకైనా హింస, మారణాయుధాలతో పరిష్కారం లభించదని అన్నారు. హింస ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతం బాగుపడిన దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు. జాతుల సమస్య, ఉగ్రవాదాన్ని శాంతియుతంగానే పరిష్కరిస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రతి మనిషి తనను తాను శారీరకంగా దృఢంగా ఉంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ నిత్యం ఆటలు ఆడేలా పాఠశాలలన్నీ ప్రోత్సహించాలని సూచించారు. ఉగ్రవాదంలో ఉన్నవాళ్లంతా శాంతిబాట పట్టాలని తెలిపారు.
Go Back to Shorts
Narendra Modi
Mann Ki Baat
Prime Minister
India
BJP

More Telugu News