ఏపీ భవన్ లో 'ఐ లవ్ అమరావతి' బోర్డు తొలగింపు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న ఐ లవ్ అమరావతి బోర్డును తొలగించారు. ఏపీ భవన్ సిబ్బంది బోర్డును తీసివేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏపీ భవన్ లో అమరావతి బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాలతోనే బోర్డును తొలగించినట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రాజధాని అమరావతి భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
AP Bhavan
Amaravati Board
New Delhi
Resident Commissioner
Bhavana Saxena

More Telugu News