Andhra Pradesh: సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి
బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. కైలాస్ సత్యార్థికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం జగన్ తన చాంబర్ లో ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైలాస్ సత్యార్థి ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు.