సీఏఏపై విమర్శకుల ప్రశ్నలను ప్రధాని మోదీ స్వీకరించాలి: పి చిదంబరం
- మీడియా ప్రశ్నలన్నింటినీ మేము ఎదుర్కొంటున్నాం
- చర్చల ద్వారా ప్రజల సందేహాలు తొలగుతాయి
- విమర్శకులను ఎంచుకుని ప్రశ్నలను ఎదుర్కోవడమే మీకున్న మార్గం
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీలపై ప్రతిపక్షాలతో సమావేశం కావడానికి ముందు చిదంబరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలను శాంతింపజేసేందుకు పెద్ద పెద్ద వేదికల నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తుంటారు. కానీ, ఎలాంటి ప్రశ్నలు స్వీకరించరు. మేము మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రశ్నలను ఎదుర్కొంటాం. ప్రస్తుతం ఎవరైనా ఐదుగురు విమర్శకుల్ని ఎంచుకుని వారి నుంచి ప్రశ్నలను స్వీకరించడమే ప్రధాని ముందున్న ఏకైక మార్గం. ఈ సూచనకు ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.