జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యం

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులను రక్తమోడేలా చితకబాదారు. ఈ ఘటన తర్వాత విద్యార్థులు, అధ్యాపకుల్లో భయం నెలకొంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే కేసును ఛేదించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థులు, అధ్యాపకుల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టి, క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ జేఎన్‌యూ పాలకవర్గాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జగదీశ్ కుమార్ తెలిపారు. 
Go Back to Shorts
JNU
New Delhi
Attack

More Telugu News