Jagan: నేడు వైఎస్ జగన్ ఫుల్ బిజీ... షెడ్యూల్ ఇదే!
- కాసేపట్లో కలవనున్న పాక్ నుంచి విడుదలైన మత్య్సకారులు
- 10.30 గంటలకు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష
- ఆపై సీఆర్డీయే, విశాఖ మెట్రోలపై రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఆయన షెడ్యూల్ ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఈ ఉదయం పాక్ నుంచి విడుదల అయిన రాష్ట్రానికి చెందిన మత్య్యకారులు జగన్ ను కలవనున్నారు. ఆపై ఉదయం 10.30 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో త్వరలో రానున్న ఎన్నికలు, ఉపాధి హామీ పథకం అమలు తీరు గురించి జగన్ అడిగి తెలుసుకోనున్నారు.
ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీయే అధికారులతో జగన్ మరో రివ్యూ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అమరావతి రైతుల నిరసనలు, రాజధానిని వికేంద్రీకరణ చేస్తే, అమరావతి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన విశ్లేషించనున్నారు. దాని తరువాత, సాయంత్రం 4.30 గంటలకు విశాఖ మెట్రోపై ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది.
ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీయే అధికారులతో జగన్ మరో రివ్యూ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అమరావతి రైతుల నిరసనలు, రాజధానిని వికేంద్రీకరణ చేస్తే, అమరావతి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన విశ్లేషించనున్నారు. దాని తరువాత, సాయంత్రం 4.30 గంటలకు విశాఖ మెట్రోపై ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది.