Goa: పౌరసత్వ సవరణ చట్టానికి గోవా మద్దతు.. ఎన్నార్సీపై మాట్లాడేందుకు సీఎం విముఖత

  • సీఏఏ వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేదు
  • ఎన్సార్సీపై ఇప్పుడే స్పందించబోం
  • కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత చూద్దాం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా మాట్లాడుతుండగా, గోవాలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ చట్టం వల్ల గోవా ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అయితే, ఎన్నార్సీపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎన్సార్సీ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన వెలువడలేదని, వచ్చిన తర్వాత స్పందిస్తామని ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు.
Goa
CAA
pramod sawant

More Telugu News