amaravathi: నా పేరుపై బినామీ ఉన్నట్టు నిరూపించినా సరే, దేనికైనా సిద్ధమే: బుగ్గనకు ప్రత్తిపాటి సవాల్

  • నాడు వైసీపీ పుస్తకంలో నాకు 198 ఎకరాలు ఉన్నాయి!
  • మంత్రి బుగ్గన మాత్రం 38 ఎకరాలు ఉన్నాయన్నారు!
  • ఈ ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు భూముులు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ప్రత్తిపాటి మరోమారు ఖండించారు. రాజధాని ప్రాంతం మందడంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఆయన కలిశారు. అనంతరం, ప్రత్తిపాటి మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఓ పుస్తకాన్ని ప్రచురించారని, తనకు 198 ఎకరాలు ఉన్నాయంటూ అందులో రాశారు, తనకు 38 ఎకరాలు ఉన్నట్టు మొన్న అసెంబ్లీలో అదే పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారని మండిపడ్డారు. అమరావతిలో తనకు మూడు గజాల భూమి ఉన్నట్టు చూపించినా సరే, ఏ శిక్షకు అయినా సిద్ధపడతాను లేకపోతే బుగ్గన రాజీనామా చేస్తాడా? అంటూ సవాల్ విసిరారు. తన పేరుపై ఎవరో సురేశ్ అనే బినామీ ఉన్నారని ఆరోపిస్తున్నారని, కనీసం, ఇదైనా నిరూపిస్తే, దేనికైనా సిద్ధమేనంటూ బుగ్గనకు ఛాలెంజ్ విసిరారు.
amaravathi
Land
Telugudesam
prathipati

More Telugu News