Karnataka: కర్ణాటక పరిస్థితిని చూసిన తర్వాత కూడా హైకోర్టును తరలించగలం అనుకుంటున్నారా?: వర్ల రామయ్య

షార్ట్స్‌లో చూడండి
జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించడం తదితర పరిణామాలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. 'సీఎం గారూ, మీ కమిటీ మీరు చెప్పిందే రాస్తుంది, ఆ కమిటీ రాసిన రాతలకు ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది' అంటూ ట్వీట్ చేశారు. హైకోర్టును తరలించాలనుకోవడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని, అంత తేలిక కాదని హితవు పలికారు. రాష్ట్రపతి అనుమతి, సుప్రీంకోర్టు ఆమోదం ఇట్లాంటి ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. 'కర్ణాటకలో హుబ్లీలో హైకోర్టు బెంచ్ కావాలని ఎంతోకాలం నుంచి అడుగుతున్నా సుప్రీంకోర్టు అంగీకరించట్లేదు, మీరే విధంగా తరలించగలమనుకుంటున్నారు?' అంటూ ప్రశ్నించారు.
Go Back to Shorts
Karnataka
Andhra Pradesh
YSRCP
Jagan
High Court
Varla Ramaiah
Telugudesam

More Telugu News