పౌరసత్వ సవరణ చట్టంపై మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
- ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో రెఫరెండం చేపట్టాలి
- ఓడిపోతే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలి
- సీఏఏను వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు ఆపొద్దు
నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మమత ఆరోపించారు. ఎన్ఆర్సీ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మమత సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఓటర్ల జాబితా పనులు మొదలయ్యాయని, జాబితాలోని నకిలీ పేర్లను తొలగిస్తామని మమత పేర్కొన్నారు. ప్రజలందరి పేర్లూ జాబితాలో ఉంటాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.