Tollywood: అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

  • అలీ తల్లి తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధపడ్డా
  • ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి
  • అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో నాకు తెలుసు
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతును బీబీ మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తనకు తెలుసని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
Tollywood
Ali
Janasena
Pawan Kalyan

More Telugu News