Telugudesam: జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: హెచ్చరించిన నారా లోకేశ్

  • సుబ్బారావు హత్య ఘటనపై లోకేశ్ స్పందన
  • జగన్ నైజం క్రూరత్వం.. ఆయన పాలన పైశాచికత్వం
  • అందుకు ఈ ఘటనే నిదర్శనం 
కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు సుబ్బారావు హత్యకు గురైన ఘటనపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నైజం క్రూరత్వం అని, ఆయన పాలన పైశాచికత్వం అనేందుకు ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు. జగన్ చేస్తున్న హత్యారాజకీయాలు, కక్ష పూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వస్తుందని లోకేశ్ హెచ్చరించారు.
Telugudesam
Nara Lokesh
Cm
Jagan

More Telugu News